పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 12 జగయ్యపేట్ట మండలం గండ్రాయి గ్రామంలో ని ఈరోజు న మండల పరిషత్ ప్రదర్శన పాఠశాల నందు ఘనంగా మహాత్మ జ్యోతిరావు ఫూలే 199వ, జయంతి. వేడుకలనుమండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల గండ్రాయి. మెయిన్ నందు ఘనంగా నిర్వహించటమైనది.. ఈ సందర్భంగా ప్రదానోపాద్యాయులు రమేష్ బాబు మాట్లాడుతూ ఫూలే .1827 ఏప్రియల్ 11వ.,తేదీన గోవిందరావు ఫూలే ,చిన్మాబాయి . దంపతులకు మహారాష్ట్ర లోని పూణే పట్టణంలో జన్మించారని , జ్యోతిరావు ఫూలే కి అప్పట్లో 13ఏళ్ళ వయస్సులోనే సావిత్రి బాయి ని. వివాహం జరగిందని . ఆ కాలంలో బార్యకు చదువు చెప్పిన మొదటి ఉపాధ్యాయురాలుగా ఉన్న వ్యక్తి గా చరిత్రలో నిలిచిపోతారని ,1848లోనే బాలికల చదువు కోసం దేశంలోనే మొదటి బాలికల పాఠశాలను స్థాపించారని,1873లో బార్యతో కల్సి సత్య శోధక సమాజం అనే సంస్థను స్థాపించి ప్రజలకు ఎలా బాధ్యతలో ఉండాలో రాజ్య అధికార ఫలాలను ఎలా సాధించాలి అనేక కార్యక్రమాలను నిర్వహించారని ,ఈయన అనేక రచనలు రాసినప్పటకి” గులాంగిరి ” నవలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పేదల అభ్యున్నతి కొరకు పాటునపడిన వ్యక్తి అని , ఈయనకు “మహాత్మా ” అనే బిరుదు కలదని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుబ్బారావు, దేవదానం, పద్మావతమ్మ ,ముక్తేశ్వరావు విద్యార్థులు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొని మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు విద్యార్థుల మధ్య ఉపాధ్యాయులు మధ్య ఘనంగా నిర్వహించారు