మందమర్రి సహారా బాధితుల ధర్నా ఫిక్స్ డిపాజిట్ చేసి కాలపరిమితి దాటిన డబ్బులను చెల్లించాలని ఆందోళన చేసిన బాధితులు

సహారా ఇండియా మందమరి బ్రాంచ్ ముందు బాధితులు ఆందోళన

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 14 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమర్రి మార్కెట్ లో ఉన్న సహారా కార్యాలయం ముందు సహారా ఇండియా సంస్థ లో మేము ఫిక్స్ డిపాజిట్ చేసిన డబ్బులను కాలపరిమితి దాటిపోయి 4-5 సంవత్సరాలు గడుస్తున్నా సహారా యాజమాన్యం డబ్బులు చెల్లించకపోవడంతో నిరసన గా బాధితులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డ్స్ చేత బూని సహారా ఇండియా లో మేము ఫిక్స్ డిపాజిట్ చేసిన కాలపరిమితి దాటిపోయి మా డబ్బులను మాకు వెంటనే చెల్లించాలని నిరసన చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేము కట్టిన డబ్బులను వెంటనే చెల్లించాలని లేని యెడల జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సహారా బాధితులు పేర్కొన్నారు. లక్షలాది మంది సహారా బాధితుల సమస్యల పరిష్కారం కోసం గౌరవ జిల్లా లోని ఎం ఎల్ ఏ లు , రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి అదే విధంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ సహారా బాధితుల సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మందమర్రి సహారా ఇండియా మేనేజర్ కి మా డబ్బులు మాకు వెంటనే ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక అధ్యక్షుడు మరియు సహారా ఇండియా బాధితుడు గజెల్లి వెంకటయ్య, సహారా బాధితులు సిహెచ్ సంజీవ్, డి రాజమౌళి, కళ్యాడపు శ్రీనివాస్, మెండే భాస్కర్, రామ్ నరేష్ బాబు, సి హెచ్ సంపత్, ఎస్ మధు, దుర్గం మల్లేశ్వరి, భేరి రమాదేవి, దూత లక్ష్మి, పాషా, అబేదా తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *