పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్ /16:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కెసిఆర్ కప్ -2026 టోర్నమెంట్ లో భాగంగా వంతడుపుల వైస్ రేపాక జట్ల మధ్య జరుగగా వంతడుపుల జట్టు విజేతగా నిలిచింది. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ సాధించిన రహీంఖాన్ పేట గ్రామ క్రీడాకారుడు ఉతకం వెంకన్న కు మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సిద్ధం వేణు,బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లె నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ లు గొట్టిపర్తి పర్శరాములు, సావనపల్లి అనిల్, మాజీ సర్పంచ్ లు ఉపసర్పంచ్లు సాదుల్, ప్రశాంత్,మాజీ ఏ ఎం సి డైరెక్టర్ రాగటి రమేష్, మరియు నాయకుల చేతుల మీదుగా మెడల్ అందజేయడం జరిగింది. .