సూళ్లూరుపేట పురపాలక సంఘం నందు జనగణన పై శిక్షణ కార్యక్రమం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పురపాలక సంఘం నందు జనగణన–2027 నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు సూళ్లూరుపేట స్పెషల్ ఆఫీసర్ కె.దేవేంద్ర రెడ్డి సూచనలు మేరకు మరియు ఛార్జ్ ఆఫీసర్ మరియు మునిసిపల్ కమీషనర్, సూళ్లూరుపేట పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైసర్స్ కు ఫీల్డ్ ట్రైనర్స్ చే విస్తృత స్థాయి శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఛార్జ్ ఆఫీసర్ మరియు మునిసిపల్ కమీషనర్ కె.చిన్నయ్య మాట్లాడుతూ సెల్ఫ్ ఎన్రోల్మెంట్ తేదీ:16.04.2026 నుండి ప్రారంభం అవుతుంది కావున సూళ్లూరుపేట పట్టణం ప్రజలు se.census.gov.in సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు మరియు శిక్షణ కార్యక్రమం ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైసర్స్ కి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, విధానాలు మరియు కార్యాచరణపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, శాఖాధికారులు, ఫీల్డ్ సిబ్బంది మరియు నియమిత ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైసర్స్ పాల్గొన్నారు. గృహాల వారీగా వివరాల సేకరణ విధానం, మొబైల్/డిజిటల్ అప్లికేషన్ వినియోగం, జనగణన మార్గదర్శకాలు, డేటా ఎంట్రీ ప్రక్రియ, అలాగే సమాచార సేకరణలో ఖచ్చితత్వం మరియు సమయపాలన ప్రాముఖ్యత వంటి అంశాలపై వివరంగా శిక్షణ అందించబడింది. శిక్షణలో పాల్గొన్న వనరుల వ్యక్తులు జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాది అని పేర్కొంటూ, సేకరించబడే సమాచారం ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ప్రతి ఎన్యూమరేటర్ మరియు సూపర్వైసర్ బాధ్యతతో, నిబద్ధతతో పనిచేసి నిజమైన మరియు సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మున్సిపల్ అధికారులు జనగణన–2027ను పారదర్శకంగా, క్రమబద్ధంగా మరియు సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు. ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలను సమర్థంగా పరిష్కరించేందుకు తగిన మార్గదర్శకాలు కూడా అందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *