రోడ్డు భద్రతాలు నియమాలు పాటించండి చేగుంట ఎస్సై చైతన్య రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 16 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ రోడ్డు వారోత్సవాల్లో భాగంగా పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంట విద్యార్థులు చేగుంట పాఠశాల నుండి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చేగుంట ఎస్సై చైతన్య రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతామని మద్యం తాగి వాహనాలు నడప రాదని అతివేగం కూడా ప్రమాదాల కారణమవుతాయని ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలి వారన్నారు ఈ కార్యక్రమంలో చేగుంట ఎంఈఓ ఎస్సై 2 బిక్య నాయక్ పోలీస్ సిబ్బంది వెంకటేష్,మహేష్ సిద్దు రవి ఉపాధ్యాయులు చల్లా లక్ష్మణ్ గర్దాస్ మనోహర్ రావు రావుల వెంకటేష్ ఉమామహేశ్వరి సరస్వతి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *