పయనించే సూర్యుడు న్యూస్: ఏప్రిల్/20:నియోజకవర్గం స్టాప్ ప్రతినిది:సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోని యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్. యువజన కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు వీకేర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ మరియు అసెంబ్లీ వ్యవహారల శాఖ మంత్రి వర్యలు దుద్ధిల్ల శ్రీధర్ బాబు,ఇతర మంత్రులతో కలిసి మంథని నియోజకవర్గంలోని మేడిగడ్డ, కాళేశ్వరంలో పర్యటించి అనంతరం. కాటారం మండలం నస్తూరిపల్లిలో రైతు సోదరుల కోసం నిర్వహించనున్న కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి “రెండో విడత” రైతు భరోసా నిధుల్ని విడుదల చేస్తారని కాటారంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని. మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ కోరారు. ఇల్లంతకుంట మండలం నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.